ఆ ఆలయంలో అద్భుతం.. శివుని హృదయం, చేతులకు మాత్రమే పూజలు..

మనమందరం శివాలయాల్లో అంటే శివుని దేవాలయంలో శివలింగం రూపాన్ని పూజించడం చూస్తూ ఉంటాం.

Update: 2024-05-26 12:49 GMT

దిశ, ఫీచర్స్ : మనమందరం శివాలయాల్లో అంటే శివుని దేవాలయంలో శివలింగం రూపాన్ని పూజించడం చూస్తూ ఉంటాం. అయితే మన దేశంలో శివుని హృదయం, ఆయన చేతులను పూజించే ఆలయం ఉందని చాలా మందికి తెలియదు. అంతేకాదు ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆలయంగా కూడా చెబుతారు. అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది. ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ?

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3,680 మీటర్ల ఎత్తులో తుంగనాథ్ పర్వతం మీద ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తుంగనాథ్ పర్వతం పై ఉన్నందున, ఈ ఆలయానికి 'తుంగనాథ్' ఆలయం అని పేరు వచ్చింది. ఇది మహాదేవుని పంచ కేదార్లలో ఒకటి. ఈ ఆలయంలో శివుని హృదయం, ఆయన చేతులు పూజిస్తారు. ఈ ఆలయాన్ని పూజించే బాధ్యతను మక్కామత్ గ్రామానికి చెందిన స్థానిక బ్రాహ్మణుడికి అప్పగించారు. ఈ ఆలయంలో మైథాని బ్రాహ్మణులు పూజారులుగా పనిచేస్తున్నారని చెబుతారు. ఈ బాధ్యతను వారసత్వంగా స్వీకరించినట్లు భావిస్తున్నారు. ఆ కుంటుంబంలోని పూర్వీకులు భోలేనాథుని హృదయాన్ని, చేతులను పూజించేవారు.

ఆలయ నిర్మాణం..

తుంగనాథ్ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రసిద్ధ కథనం ఉంది. వేల సంవత్సరాల క్రితం పాండవ సోదరులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. నిజానికి మహాభారత యుద్ధంలో, పాండవులు తమ సోదరులను, గురువులను చంపారు. పాండవులకు తమ బంధువులను చంపిన పాపం తగిలిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో వ్యాస మహర్షి పాండవులను శివుడు క్షమించినప్పుడే పాపం నుండి విముక్తులవుతారని చెప్పాడు. అప్పుడు పాండవులు శివుడిని వెతకడం ప్రారంభించి హిమాలయాలకు చేరుకున్నారు. చాలా కష్టపడుడుతుండగా శివుడు గేదె రూపంలో వారికి దర్శనం ఇచ్చాడు. అయితే పాండవులు దోషులని తెలిసి శివుడు వారిని తప్పించుకుని భూగర్భంలోకి వెళ్ళాడు. తరువాత అతని శరీర భాగాలు (గేదె) ఐదు వేర్వేరు ప్రదేశాలకు చేరుకున్నాయి.

ఈ అవయవాలు ఎక్కడ కనిపించినా పాండవులు అక్కడ శివాలయాలు నిర్మించారు. ఈ ఐదు గొప్ప శివాలయాలను 'పంచ కేదార్' అంటారు. ప్రతి ఆలయం శివుని శరీరంలోని ఒక భాగంతో గుర్తిస్తారు. తుంగనాథ్ పంచకేదార్లలో మూడవది. (తృతీయకేదార్) తుంగనాథ్ ఆలయ స్థలంలో శివుని చేతులు కనుగొన్నారు. దీని ఆధారంగానే దేవాలయం పేరు కూడా పెట్టారు. తుంగ్ అంటే చేతి, నాథ్ శివుడిని సూచిస్తుంది.

తుంగనాథ్ ఆలయంతో పాటు ‘పంచకేదార్’లో కేదార్‌నాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్ ఉన్నాయి. కేదార్‌నాథ్‌లో భగవంతుని మూపురం కనిపించింది. రుద్రనాథ్‌లో అతని తల, కల్పేశ్వర్‌లో జుట్టు, ఆయన నాభి మహేశ్వర్‌లో దర్శనం ఇస్తుంది.

ఆలయంలో నమ్మకాలు..

శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని నమ్ముతారు. అలాగే శ్రీరాముడు రావణుడిని చంపినప్పుడు, బ్రాహ్మణుడిని చంపిన శాపం నుండి విముక్తి కోసం ఈ ప్రదేశంలోనే శివుడి కోసం తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ఈ ప్రాంతానికి ‘చంద్రశిల’ అనే పేరు కూడా ప్రసిద్ధి చెందింది.

'తుంగనాథ్'కి ఎప్పుడు ఎలా వెళ్ళాలి..

వాస్తవానికి మే నుండి నవంబర్ వరకు ఎప్పుడైనా తుంగనాథ్ దర్శనానికి వెళ్లవచ్చు. కానీ ఇక్కడి ప్రజలు జనవరి, ఫిబ్రవరి సమయాన్ని చాలా ఇష్టపడతారు. ఈ కాలంలో ఇక్కడ మంచు ఎక్కువగా ఉంటుంది. 'తుంగనాథ్' దర్శనం కోసం రిషికేశ్ నుండి గోపేశ్వర్ మీదుగా చోప్తాకు వెళ్లాలి. దీని తరువాత, 'తుంగనాథ్' కోసం స్థానిక వనరులు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా ఇతర మార్గం రిషికేశ్ నుండి ఉఖిమత్ మీదుగా వెళుతుంది. ఉఖిమఠ్ నుండి కూడా చోప్తాకి వెళ్లాలి. ఆ తర్వాత 'తుంగనాథ్' ఆలయానికి అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News