ఆ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం రద్దు….

దిశ వెబ్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. సెప్టెంబర్14న ఒకరోజు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రశ్నోత్తరాల సమావేశం ఉండదంటూ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ప్రకటించారు. కాగా సమావేశానికి హాజరయ్యే సభ్యులు, మీడియా ప్రతినిధులు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక ఇప్పటి వరకు చర్చల ఎజెండా ఖరారు కాలేదని తెలిపారు. కానీ ప్రశ్నోత్తరాల సమయం మాత్రం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అయితే సభలో 280 నిబంధన కింద […]

Update: 2020-09-11 07:55 GMT

దిశ వెబ్ డెస్క్:
ఢిల్లీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. సెప్టెంబర్14న ఒకరోజు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రశ్నోత్తరాల సమావేశం ఉండదంటూ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ప్రకటించారు. కాగా సమావేశానికి హాజరయ్యే సభ్యులు, మీడియా ప్రతినిధులు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక ఇప్పటి వరకు చర్చల ఎజెండా ఖరారు కాలేదని తెలిపారు. కానీ ప్రశ్నోత్తరాల సమయం మాత్రం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అయితే సభలో 280 నిబంధన కింద చర్చ ఉంటుందని ఆయన చెప్పారు. కాగా ఇప్పటికే ప్రశ్నోత్తరాల సమయాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News