డీసీఎం వ్యాన్ బోల్తా.. 70కి పైగా గొర్రెలు మృతి

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం డోర్నకల్ మండలం పెరుమాండ్లసంకీస గ్రామ సమీపంలో అదుపు తప్పి గొర్రెల వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో డీసీఎం వ్యాన్‌లో ఉన్న 70కి పైగా గొర్రెలు మృతి చెందాయి. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గొర్రెలను డీసీఎం వ్యాన్‌లో గూడూరు నుంచి మధిరకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2021-01-26 23:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం డోర్నకల్ మండలం పెరుమాండ్లసంకీస గ్రామ సమీపంలో అదుపు తప్పి గొర్రెల వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో డీసీఎం వ్యాన్‌లో ఉన్న 70కి పైగా గొర్రెలు మృతి చెందాయి. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గొర్రెలను డీసీఎం వ్యాన్‌లో గూడూరు నుంచి మధిరకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News