ఇబ్రహీంపట్నంలో విషాదం

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి పాత ఇల్లు కూలిపోవడంతో తల్లీకూతురు దుర్మరణం చెందారు. మృతులు… సువర్ణ (45), స్రవంతి (17)గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అటు.. భారీ వర్షం కారణంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలుచోట్ల కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద డివైడర్‌ పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో […]

Update: 2020-10-13 11:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి పాత ఇల్లు కూలిపోవడంతో తల్లీకూతురు దుర్మరణం చెందారు. మృతులు… సువర్ణ (45), స్రవంతి (17)గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అటు.. భారీ వర్షం కారణంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలుచోట్ల కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద డివైడర్‌ పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News