‘నష్టాన్ని నేరస్థుల నుంచే వసూలు చేస్తాం’

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గతవారం చోటుచేసుకున్న అల్లర్లపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసినట్టు సీఎం యెడియూరప్ప వెల్లడించారు. అవసరమైతే గూండా చట్టాన్ని ప్రయోగించడాన్ని సిట్ పరిశీలిస్తుందని తెలిపారు. అల్లర్లకు కారకులైన వారిపై కఠిన చర్యలుంటాయని, అవసరమైతే వారిపై ఉపా చట్టాన్ని ప్రయోగించే అవకాశముందని వివరించారు. కాగా, ధ్వంసమైన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అందుకు కారకులైన దోషుల నుంచే వసూలు చేస్తామని తెలిపారు. నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు క్లెయిమ్ […]

Update: 2020-08-17 10:36 GMT

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గతవారం చోటుచేసుకున్న అల్లర్లపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసినట్టు సీఎం యెడియూరప్ప వెల్లడించారు. అవసరమైతే గూండా చట్టాన్ని ప్రయోగించడాన్ని సిట్ పరిశీలిస్తుందని తెలిపారు. అల్లర్లకు కారకులైన వారిపై కఠిన చర్యలుంటాయని, అవసరమైతే వారిపై ఉపా చట్టాన్ని ప్రయోగించే అవకాశముందని వివరించారు.

కాగా, ధ్వంసమైన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అందుకు కారకులైన దోషుల నుంచే వసూలు చేస్తామని తెలిపారు. నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు క్లెయిమ్ కమిషనర్‌ ఏర్పాటుకు హైకోర్టును ఆశ్రయిస్తామని వివరించారు.

Tags:    

Similar News