పెట్రోల్ బంకుల యాజమాన్యంపై క్రిమినల్ కేసు..

దిశ, వెబ్‌డెస్క్ : కామారెడ్డి జిల్లాలోని రెండు పెట్రోల్ బంకుల యాజమానులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆదివారం జిల్లాలోని పలు పెట్రోల్ బంకులపై లీగల్ మెట్రాలజీ అధికారులు, పోలీసులు రైడ్స్ జరిపారు. ఈ నేపథ్యంలోనే అత్యాధునిక చిప్‌లను అమర్చి వినియోగదారులను మోసం చేస్తున్న రెండు బంకులను గుర్తించారు. ఈ మేరకు యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇకమీదట ఎవరైనా పెట్రోల్ బంకుల్లో వినియోగదారులను మోసం చేసినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని […]

Update: 2020-09-06 00:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

కామారెడ్డి జిల్లాలోని రెండు పెట్రోల్ బంకుల యాజమానులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆదివారం జిల్లాలోని పలు పెట్రోల్ బంకులపై లీగల్ మెట్రాలజీ అధికారులు, పోలీసులు రైడ్స్ జరిపారు.

ఈ నేపథ్యంలోనే అత్యాధునిక చిప్‌లను అమర్చి వినియోగదారులను మోసం చేస్తున్న రెండు బంకులను గుర్తించారు. ఈ మేరకు యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇకమీదట ఎవరైనా పెట్రోల్ బంకుల్లో వినియోగదారులను మోసం చేసినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Tags:    

Similar News