BREAKING: షాద్‌నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం, నలుగురికి గాయాలు

షాద్‌నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-03-18 12:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: షాద్‌నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యానులో ఆరుగురు పూజారులు కలిసి కారులో బెంగళూరు పట్టణం నుంచి కాశీ పట్టణానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు షాద్‌నగర్ శివారులోకి రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News