బిగ్ అలర్ట్.. అయోధ్య రాముడి పేరుతో కొత్త మోసం

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లన్నీ చకచక జరుగుతున్నాయి. వచ్చే నెల జనవరి 22న ఆలయం ప్రారంభం కాబోతున్నది.

Update: 2023-12-31 13:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లన్నీ చకచక జరుగుతున్నాయి. వచ్చే నెల జనవరి 22న ఆలయం ప్రారంభం కాబోతున్నది. ఈ క్రమంలో కొందరు కేటుగాళ్లు రామాలయం పేరుతో మోసానికి తెర లేపినట్లు విశ్వహిందూ పరిషత్ భక్తులను అప్రమత్తం చేసింది. రామాలయానికి విరాళాల ఇవ్వాలని కొందరు సైబర్ నేరగాళ్లు సోషల్ క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా భక్తులను లూటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ అప్రమత్తం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోందని విరాళాలు సేకరించేందుకు మాత్రం ఎవరికి అధికారం లేదని వినోద్ తెలిపారు. ఇటువంటి వాటి విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News