విషాదం.. రాజన్న సన్నిధిలో గుండెపోటుతో భక్తురాలి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మరణించిన సంఘటన చోటు చేసుకుంది.

Update: 2023-06-06 03:48 GMT

దిశ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మరణించిన సంఘటన చోటు చేసుకుంది. మానకొండూరు మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాజేశం, లక్ష్మి దంపతులు సోమవారం వేములవాడకు వచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉందని ఈరోజు తెల్లవారుజామున దర్శనం చేసుకుందామని ఆలయానికి వచ్చే సమయంలో లక్ష్మికి ఒక్కసారిగా చాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో గుండెపోటుతో మరణించింది. లక్ష్మీ మృతితో రాజేశం శోక సముద్రంలో మునిగిపోయారు.

Tags:    

Similar News