కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సైదాపూర్ మండల పరిధిలోని దుద్దెనపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2023-05-31 12:39 GMT

దిశ, సైదాపూర్ : కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సైదాపూర్ మండల పరిధిలోని దుద్దెనపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అప్పాల లక్ష్మి (51) అనే మహిళ గత కొద్ది రోజులగా తీవ్రమైన కడుపు నొప్పి బాధపడుతోంది. ఈ క్రమంలోనే లక్ష్మి మంగళవారం తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి భర్త అప్పల గాలయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జన్ను ఆరోగ్యం తెలిపారు.

Tags:    

Similar News