కృష్ణా నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం...

మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి గ్రామంలోని కృష్ణానదిలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.

Update: 2023-06-17 11:42 GMT

దిశ, మఠంపల్లి : మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి గ్రామంలోని కృష్ణానదిలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుడు నలుపు రంగు పాయింట్, కాకిరంగు టీ షర్ట్ ధరించినట్లుగా గుర్తించారంటూ తెలిపారు. మృతదేహం కుళ్ళిపోవడంతో హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించామని స్థానిక ఎస్సై బాలకృష్ణ తెలిపారు. ఒకవేళ మృతుని ఆచూకీ తెలిసినవారు మఠంపల్లి పోలీస్ స్టేషన్లో సంప్రదించగలరని కోరారు.

Tags:    

Similar News