రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి.. నలుగురికి గాయాలు

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలైన సంఘటన గురువారం కృష్ణ మండలంలో జరిగింది.

Update: 2023-05-25 17:08 GMT

దిశ, కృష్ణ: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలైన సంఘటన గురువారం కృష్ణ మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.  కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓబులపురం గ్రామానికి చెందిన పల్లె అశోక్ (25) అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి  తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అశోక్ మృతదేహాన్ని పోస్టుమార్టం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News