Jallikattu in Chittoor: జల్లికట్టులో అపశృతి.. ఇద్దరు వ్యక్తులు మృతి

Two killed during Jallikattu in Chittoor| చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుడిపాల మండలం సిబండపల్లిలో జల్లికట్టు నిర్వహించారు. కాగా, ఈ జల్లికట్టులో పాల్గొన్న ఇద్దరు యువకులు.. ఎద్దులను పట్టుకునే క్రమంలో మృతి చెందారు

Update: 2022-08-13 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: Two killed during Jallikattu in Chittoor| చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుడిపాల మండలం సిబండపల్లిలో జల్లికట్టు నిర్వహించారు. కాగా, ఈ జల్లికట్టులో పాల్గొన్న ఇద్దరు యువకులు.. ఎద్దులను పట్టుకునే క్రమంలో మృతి చెందారు. మరికొందరు గాయపడటంతో తీవ్ర విషాదం నెలకొంది. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా, మృతుల్లో.. ఒకరు స్థానిక ముటుకూరుకు చెందిన వెంకటేష్ కాగా.. మరో యువకుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్టు

Tags:    

Similar News