కడ్తాల్ బైపాస్ వద్ద రెండు లారీలు ఢీ

నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహాదారి బైపాస్ వద్ద శుక్రవారం రెండు లారీలు ఢీకొన్నాయి.

Update: 2022-12-02 07:51 GMT

దిశ,నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహాదారి బైపాస్ వద్ద శుక్రవారం రెండు లారీలు ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుండి శనగల లోడుతో రాయచూరు వెళ్తున్న ఏపీ 39 టీహెచ్ 4239 నంబర్ గల లారీని గుజరాత్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న మరో లారీ ఏపీ 16 టీహెచ్ 9234 ఢీకొట్టింది. ప్రమాదంలో రాయచూరు వెళ్తున్న లారీ అదుపుతప్పి జాతీయ రహదారిపై డివైడర్ మధ్యలో గల ఇనుప రైలింగ్‌ను ఢీ కొట్టింది. ఇందులో నుండి డ్రైవర్, క్లీనర్ చాకచక్యంగా బయటపడటంతో ప్రాణ నష్టం తప్పింది. లారీలోని శనగలు రోడ్డుపై పడడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను దారి మళ్ళించారు.

Similar News