కరెంట్ షాక్ తో రెండు ఆవులు, ఒక గేదె మృతి

కరెంట్ షాక్ కు గురై రెండు ఆవులు ఒక గేదె మృతి చెందిన ఘటన చౌడపూర్ మండలం వీరపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2022-12-06 17:21 GMT

దిశ, చౌడపూర్: కరెంట్ షాక్ కు గురై రెండు ఆవులు ఒక గేదె మృతి చెందిన ఘటన చౌడపూర్ మండలం వీరపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాలి యాదయ్యకు చెందిన రెండు ఆవులు, ఒక గేదె మేత మేస్తున్న సమయంలో విద్యుత్ తీగ కాళ్లకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో రైతు యాదయ్య కన్నీరు మున్నీరవుతున్నారు. ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బాధిత రైతు కోరాడు.

Similar News