విహార యాత్రలో విషాదం.. రిజర్వాయర్లో జారిపడి ముగ్గురు విద్యార్థులు మృతి
దిశ, పీఏపల్లి్: నల్లగొండ జిల్లాలోని పీఏపల్లి మండలంలోని అంగడిపేటలో విషాదం చోటుచేసుకుంది.
దిశ, పీఏపల్లి: నల్లగొండ జిల్లాలోని పీఏపల్లి మండలంలోని అంగడిపేటలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వచ్చిన ముగ్గురు బీఫార్మసీ విద్యార్థులు అక్కంపల్లి రిజర్వాయర్లో కాలుజారి పడి మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో హైదరాబాద్ నుండి కారులో 8 మంది విద్యార్థులు అక్కంపల్లి రిజర్వాయర్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో సరదాగా కాల్వలోకి దిగగా ముగ్గురు విద్యార్థులు కాలుజారి గల్లంతై మృతిచెందారు. మృతులు ఫార్మసీ విద్యార్థులు ఆకాష్, కృష్ణ, గణేష్గా గుర్తించారు. ఇద్దరు విద్యార్థుల శవాలు దొరకగా ఒక్క విద్యార్థి గల్లంతు అయ్యాడు. కాల్వలో గల్లంతైన విద్యార్థి మృతదేహాన్ని స్థానిక మత్సకారులు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు, కొండమల్లెపల్లి సీఐ రవీందర్, గుడిపల్లి ఎస్ఐ వీరబాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.