హయత్ నగర్‌లో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసి నగలు దోచుకెళ్లిన దుండగులు

హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలోని తొర్రూర్‌లో దోపిడి దొంగలు దారుణానికి ఒడిగట్టారు.

Update: 2023-06-05 04:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలోని తొర్రూర్‌లో దోపిడి దొంగలు దారుణానికి ఒడిగట్టారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కిరాతకంగా హత్య చేసిన దుండగులు అనంతరం నగలు దోచుకెళ్లారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహూటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News