వీడిన మర్డర్ మిస్టరీ.. ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టిన భార్య
వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
దిశ, భీమ్గల్: వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసే భార్యే రంజిత్ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ప్రభాకర్ రావు కేసు వివరాలు వెల్లడించారు. వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ భార్య జమున నగేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తుంది. భర్త రంజిత్ తాగుడుకి బానిసగా మారి నిత్యం వేధిస్తుండటంతో.. ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించేందుకు పథకం వేశారు. ఇందులో భాగంగా అక్టోబర్ 20వ తేదీన రంజిత్కు ఫుల్గా మద్యం తాగించి ప్లాన్ ప్రకారం హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా పక్కనే ఉన్న మామిడిలో రంజిత్ మృత దేహాన్ని పాతిపెట్టారు.
హత్య అనంతరం అక్టోబర్ 24వ తేదీన జమున వేల్పూర్ పోలీస్ స్టేషన్లో తన భర్త రంజిత్ కుమార్ కనబడడం లేదని.. గొడవ పెట్టుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయాడని మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకన్న పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. భార్య వ్యవహార శైలిపై అనుమానం రావడంతో కాల్ డేటా ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. రంజిత్ భార్యను మరో ఇద్దరిని విచారించగా నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుండి ఒక బైక్, మూడు సెల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి, వేల్పూర్ ఎస్సై వినయ్ కుమార్, ఏఎస్సై యాదగిరి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, కానిస్టేబుళ్లు శ్రావణ్, భరత్, సతీష్, శ్రీనివాస్, ధర్మేందర్ రాజు నాయక్లను ఏసీపీ ప్రభాకర్ రావు అభినందించారు.