వీడు ఉపాధ్యాయుడు కాదు.. అభం శుభం తెలియని 6 బాలికలపై అత్యాచారం

విద్యార్థులకు విద్య, బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Update: 2023-06-06 13:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు విద్య, బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని దుంగాపూర్‌లో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్‌ రమేశ్ చంద్ర అనే కామాంధుడు అభం శుభం ఎరుగని ఆరుగురు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తరచూ ఫోర్న్ వీడియోలు చూసేవాడని, అందుకే చిన్నారులను రేప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్కూల్లో 8-12 సంవత్సరాల మధ్య ఉండే పిల్లల్ని చాక్లెట్లు, చిప్స్ ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారాం చేసేవాడని గుర్తించారు.

Similar News