ధాన్యం లారీ పల్టీ.. వ్యక్తి దుర్మరణం

జగిత్యాల జిల్లా మేడిపల్లి (తూర్పు) మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధాన్యం బస్తాల లోడ్ తో వెళ్తున్న లారీ పల్టీ కొట్టింది.

Update: 2023-05-31 10:53 GMT

మేడిపల్లి జాతీయ రహదారిపై ఘటన

దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మేడిపల్లి (తూర్పు) మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధాన్యం బస్తాల లోడ్ తో వెళ్తున్న లారీ పల్టీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సందీప్ క్యాబిన్ లో ఇరుక్కు పొగ లారీలో ప్రయాణిస్తున్న వ్యక్తి ధాన్యం బస్తాల కింద పడిపోయాడు. లారీ పల్టీ కొట్టినా సమయంలో ఎవరూ గమనించ లేదు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల నుంచి ఆర్మూర్ వైపు వరి ధాన్యంతో వెళుతున్న లారీ.. డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి పల్టి కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, అదే లారీలో ప్రయాణిస్తున్న బియ్యల కుమార్ (32) అనే వ్యక్తి ఏమయ్యడో బుధవారం వరకు ఎవరికీ తెలియదు. అనుమానంతో ధాన్యం బస్తాలు తీయడంతో బియ్యాల కుమార్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News