దారుణం.. టీచర్ ముందే ఎగ్జామ్ హాల్‌లో పోడుచుకున్న విద్యార్థులు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులను మరో విద్యార్థి ఎగ్జామ్ హాల్‌లోనే చాకుతో పొడిచాడు.

Update: 2023-04-20 07:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులను మరో విద్యార్థి ఎగ్జామ్ హాల్‌లోనే చాకుతో పొడిచాడు. దీంతో గాయపడిన విద్యార్థులను HM హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాజానగరం జిల్లా పరిషత్ హై స్కూల్‌లో చోటు చేసుకుంది. ఘర్షణ తొమ్మిదో తరగతి విద్యార్థుల మధ్య జరిగింది. కాగా విద్యార్థి దాడిలో గాయపడిన విద్యార్థులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News