బ్యాటరీలో అక్రమంగా తరలిస్తున్న బంగారం బిస్కెట్లు పట్టివేత..

గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

Update: 2023-05-24 09:22 GMT

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన  ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం దుబాయ్ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపకు చెందిన ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి లగేజీ బ్యాగును స్కానింగ్ చేయడంతో వ్యక్తి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

ప్రయాణికుడు బంగారాన్ని చార్జింగ్ బ్యాటరీలో లోపల నల్లటి కవర్లు చుట్టి బ్యాటరీ స్థానంలో అమర్చుకొని అక్రమంగా తరలిస్తుండగా ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి రూ. కోటి 81 లక్షల 60 వేల 450 ల విలువ చేసే 2 కిలో 915 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Tags:    

Similar News