ఆగి ఉన్న లారీని ఢీకొన్న జీప్.. అక్కడికక్కడే ఐదుగురు స్పాట్ డెడ్

కర్నాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2023-06-06 03:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ప్రయాణికులతో వెళ్తున్న జీప్ ఆగి ఉన్న ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీప్‌లో ప్రయాణిస్తోన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా వెలుగోడు వాసులుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News