పిడుగుపాటుకు వ్యక్తి మృతి

పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నాగంపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

Update: 2023-05-23 12:54 GMT

దిశ, జమ్మికుంట : పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నాగంపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామంచ కొమరయ్య (47) పదేళ్ల క్రితం బతుకుతెరువు కోసం నాగంపేట గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నాడు. ఓ పాత ఇనుప సామాను దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తున్న కొమురయ్య అనే వ్యక్తి పిడుగుపాటుకు గురవడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు నరేందర్, కూతుళ్లు మౌనిక, స్పందన ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన కొమురయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ చిన్నికృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News