అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కుల్కచర్ల మండల పరిధిలో జరిగింది.

Update: 2023-05-10 13:35 GMT

దిశ, కుల్కచర్ల: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కుల్కచర్ల మండల పరిధిలో జరిగింది. స్థానిక ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన కావాలి నర్సింహులు (39) మంగళవారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు.

బుధవారం ఎత్తు కాల్వ తండా శివారులోని జివి చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయి వేలాడుతుండగా కుటుంబ సభ్యులు చూశారు. మృతుడికి పలుచోట్ల రక్తపు గాయాలు కావడంతో మృతుడి భార్య కావలి జయంతి తన భర్త మరణంపై అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గిరి తెలిపారు.

Tags:    

Similar News