బిగ్ బ్రేకింగ్: సతిగూడ జలాశయంలో నాటుపడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో సతిగూడ జలాశయంలో పడవ ప్రమాదం జరిగింది.
దిశ, ఉత్తరాంధ్ర : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో సతిగూడ జలాశయంలో పడవ ప్రమాదం జరిగింది. నాటుపడవలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. నాటుపడవతో ఇద్దరు చేపల వేటకు వెళ్లిన సమయంలో హఠత్తుగా నది ప్రవాహం వేగం పెరిగింది. ఈ క్రమంలో పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ఇద్దరు గల్లంతయ్యారన్న సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. మరొక వ్యక్తి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.