బావిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య..

మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన బావు మల్లయ్య (63) అనే వృద్ధుడు సోమవారం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2023-05-08 14:47 GMT

దిశ, లక్షెట్టిపేట : మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన బావు మల్లయ్య (63) అనే వృద్ధుడు సోమవారం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు యేడాదిన్నరగా మూత్ర సమస్యతో బాధపడుతున్నాడు. రెండుసార్లు ఆపరేషన్ చేయించుకున్నా వ్యాధి నయం కాలేదు. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానిక ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News