మద్యం తాగించి.. ఆపై అత్యాచారం చేసి..

కేరళలోని కోజికోడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది.

Update: 2023-02-21 16:20 GMT

దిశ, వెబ్ డెస్క్: కేరళలోని కోజికోడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎర్నాకులం ప్రాంతానికి చెందిన నర్సింగ్ విద్యార్థినిని.. అదే ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఆమె ఇద్దరు స్నేహితులు తమ ఇంటికి ఆహ్వానించారు. అనంతరం ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఆమె మత్తులో ఉందని నిర్ధారించుకున్న తర్వాత నిందితులిద్దరూ అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న యువతి జరిగింది తలచుకొని బోరు ఏడ్చింది.

స్నేహితురాలి సాయంతో అక్కడి నుంచి బయటపడింది. అయితే బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో ఈ విషయాన్ని బాధిత యువతి ఎవరితో చెప్పలేదు. ఈ ఘటన తర్వాత కాలేజీకి యదావిధిగా వెళ్లిన బాధితురాలు ముభావంగా ఉండటం గమనించిన లెక్చరర్లు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వారితో చెప్పింది. అనంతరం వారంతా కలిసి కసాబా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి : నగరంలో మరో దారుణం.. మాయ మాటలు చెప్పి మైనర్ బాలికపై లైంగిక దాడి 

Tags:    

Similar News