Crime news : శోభనం తర్వాత స్నానం చేస్తూ నవ వధువు మృతి..

ఉత్తర ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది..

Update: 2023-01-30 08:17 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం జరిగిన తెల్లారే నవ వధువు మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వధువు పెళ్లి జరిగిన తర్వాత అత్తవారి ఇంటికి వెళ్లింంది. ఫస్ట్ నైట్ జరిగిన మరునాడు బాత్‌ రూమ్‌కు వెళ్లి స్నానం చేస్తుండగా.. ఒక్కసారిగా పడిపోయింది. ఎంతకూ బాత్ రూమ్ నుండి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి డోర్లు పగలగొట్టి చూశారు. బాత్‌రూమ్‌లో ఓ మూలకు అపస్మారక స్థితిలో ఉండటం చూసి షాక్ అయి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. గ్యాస్ గ్లీజర్ కార్బన్ మోనాక్సైడ్‌ను విడుదల చేస్తుందని అది పీల్చడం వల్ల నవ వధువు మరణించిందని వైద్యులు స్పష్టం చేశారు.    

Tags:    

Similar News