తల్లీ కూతురు ఆత్మహత్య... పోలీసులు చెబుతుంది ఇదే..?

తల్లీ కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2022-08-18 17:31 GMT

దిశ, ఖైరతాబాద్: తల్లీ కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఆర్ నగర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా ధారూర్ స్టేషన్‌కు చెందిన తులసి బాయి(40), శిరీష (16) అనే ఇద్దరు తల్లికూతుర్లు గురువారం సాయంత్రం చున్నీలతో ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీహెచ్ఎంసీలో తులసిబాయి స్వీపర్‌గా పనిచేస్తూ బోరబండలోని సారథినగర్‌లో నివాసం ఉంటున్నారు. తనతో పాటు కూతురు శిరీష కూడా ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం రావడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు విచారణ చేపట్టామని సీఐ సైదులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని వారి ఆత్మహత్యకు గల కారణాలు, తదుపరి వివరాలు విచారణ అనంతరం తెలియజేస్తామన్నారు.

Similar News