పోలీసులమంటూ వచ్చి టీడీపీ నేత కిడ్నాప్

పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ మైనారిటీ నాయకుడు కిడ్నాప్ కలకలం రేపుతోంది.

Update: 2023-06-29 09:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ మైనారిటీ నాయకుడు కిడ్నాప్ కలకలం రేపుతోంది. మాచర్ల టీడీపీ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడు అన్వర్‌ బాషాను కొందరు వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తాను పోలీసునని.. ఎస్ఐ రమ్మంటున్నారని పిలిపించి తీసుకెళ్లినట్లు తెలిపారు. పోలీస్ డ్రస్ ఏదని అడగ్గా మఫ్టీలో వచ్చినట్లు సదరు వ్యక్తి చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

బుధవారం రాత్రి అన్వర్ బాషాను తీసుకెళ్లారని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరోవైపు అన్వర్‌ బాషాను ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని ముస్లిం పెద్దలు సైతం డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాషాను దుండగులు ఎక్కడికి తీసుకెళ్లి ఉంటారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News