కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ లో పడి వ్యక్తి మృతి..

జలాశయంలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండలంలో శుక్రవారం జరిగింది.

Update: 2023-06-23 12:06 GMT

దిశ, దేవరకద్ర : జలాశయంలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండలంలో శుక్రవారం జరిగింది. దేవరకద్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ లోని శాసబ్ గుట్టకు చెందిన మహ్మద్ జేశన్ ఉర్ఫ్ అబ్రార్ (45) కోయిల్ సాగర్ జలాశయంలో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని దేవరకద్ర ఎస్సై పి.వెంకటేష్ తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News