ఘోరం.. బీజేపీ నేతను దారుణంగా కాల్చి చంపారు..

పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నేత రాజు ఝా కోల్ కతాకు వెళుతుండగా తుపాకితో కాల్చి చంపారు.

Update: 2023-04-02 06:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నేత రాజు ఝా కోల్ కతాకు వెళుతుండగా తుపాకితో కాల్చి చంపారు. రాజు ఝా తన SUV లో ఒక షాప్ ముందు వేచి ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి అతనిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ సంఘటన వెనుక ఉన్న ఉద్దేశం ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ కమనాశిష్ సేన్ తెలిపారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News