వరి ధాన్యం తరలిస్తున్న ట్రాక్టర్ పై నుంచి జారిపడి హమాలి కూలీ మృతి..

ధాన్యం తరలిస్తున్న ట్రాక్టర్ పై నుంచి జారిపడి హమాలి కూలీ మృతి చెందిన సంఘటన మక్తల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2023-05-02 11:08 GMT

దిశ, మక్తల్: ధాన్యం తరలిస్తున్న ట్రాక్టర్ పై నుంచి జారిపడి హమాలి కూలీ మృతి చెందిన సంఘటన మక్తల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. హమాలీల కథనం ప్రకారం.. మక్తల్ పట్టణానికి చెందిన కర్రేం అంజప్ప(48) హమాలి కూలీగా పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మంగళవారం మాధ్వారం గ్రామం నుంచి ఓ రైతుకు సంబంధించిన వరి ధాన్యాన్ని ట్రాక్టర్ పై మక్తల్ వ్యవసాయ మార్కెట్ కి తరలిస్తున్నారు.

కాగా పట్టణంలోని బస్టాండ్ మలుపు  వద్దకు రాగానే  ధాన్యం బస్తాల పై ఉన్న అంజప్ప ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు. దీంతో అంజప్పపకు తీవ్ర గాయాలై  మృతి చెందాడు. మృతుడి భార్య కర్రేం పద్మా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News