విషాదంలో విషాదం..ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది.

Update: 2023-06-21 15:47 GMT

దిశ రామాయంపేట/చిన్నశంకరంపేట : మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబకలహాలతో 10రోజుల క్రితం పురుగు మందు తాగి ఎల్లం అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు అందించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం చనిపోయాడు. కాగా, మంగళవారం అతని భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News