దుండిగల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి
హైదరాబాద్ పరిధిలోని దుండిగల్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ పరిధిలోని దుండిగల్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌడవెల్లి నుండి నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్కు వస్తుండగా ఓ డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.