శ్రీకాకుళం జిల్లాలో పది అడుగుల డ్రోన్ కలకలం..

శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్ కలకలం సృష్టించింది.

Update: 2023-02-02 04:53 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్ కలకలం సృష్టించింది. భావనపాడు దగ్గర మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా వారి వలకు డ్రోన్ చిక్కడం సంచలనంగా మారింది. విమానాన్ని పోలిన పది అడుగుల డ్రోన్ లభ్యం కావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. డ్రోన్ మెరైన్ పోలీసులకు వలకు చిక్కిన డ్రోన్‌ను మత్స్యకారులు అప్పగించారు. కాగా డ్రోన్లపై టార్గెట్ బన్షీ అని స్టిక్కర్లు అతికించి ఉన్నాయి. డ్రోన్ బరువు 111 కేజీలు ఉందని పోలీసులు తెలిపారు. ఆకతాయిల పనా లేక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 



Tags:    

Similar News