పాడిఆవులను పొట్టన పెట్టుకున్న పిడుగు..

జిల్లేడు చౌదరిగూడ మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.

Update: 2023-04-26 12:57 GMT

దిశ, చౌదరిగూడ : జిల్లేడు చౌదరిగూడ మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. కాగా ముష్టిపల్లి గ్రామంలో పిడుగుపడటంతో రైతు చాకలి.శ్రీనుకు చెందిన రెండు పాడిఆవులు మృత్యువాత పడ్డాయి. కాగా ఈ రెండు ఆవుల విలువ రూ.1,20,000 ఉంటుందని రైతు శ్రీను తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి. శంకర్ ఆదేశాల మేరకు సంఘటన స్థలాన్ని మండల అధ్యక్షుడు చలివేంద్రంపల్లి.రాజు సందర్శించి రైతును ఓదార్చి10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. పేద రైతును ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News