విద్యుదాఘాతానికి గురై ఆవు మృతి..

విద్యుదాఘాతానికి గురై ఆవు మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల పరిధిలో జరిగింది.

Update: 2023-05-29 12:59 GMT

దిశ, రాజాపూర్: విద్యుదాఘాతానికి గురై ఆవు మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామానికి చెందిన కటికే రామచందర్ అనే రైతుకు చెందిన ఆవు సోమవారం మేత మేసేందుకు వెళ్లగా అదే ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి మృతి చెందిన ఆవుకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు కటికె రామచందర్ కోరాడు.

Tags:    

Similar News