బ్రేకింగ్: కేరళలో ఘోర పడవ ప్రమాదం.. 9 మంది మృతి

కేరళలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి మలప్పురం తన్నూర్ బీచ్ దగ్గర ఓ టూరిస్ట్ బోటు బోల్తా పడింది.

Update: 2023-05-07 16:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి మలప్పురం తన్నూర్ బీచ్ దగ్గర ఓ టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందారు. మరికొందరు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించాయి. కాగా, ఈ ప్రమాద సమయంలో బోటులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. నీటిలో గల్లంతైన పర్యాటకుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి కావడంతో సహయక చర్యలకు ఇబ్బందులు తలెత్తున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News