చిల్వర్ గ్రామంలో దారుణం..

మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువకుడు తన సొంత అన్ననే కడతేర్చిన ఘటన మండల పరిధిలోని చిల్వర్ గ్రామంలో కలకలం రేపింది.

Update: 2023-05-20 13:47 GMT

మద్యం మత్తులో అన్నను కడతేర్చిన తమ్ముడు

దిశ, అల్లాదుర్గం : మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువకుడు తన సొంత అన్ననే కడతేర్చిన ఘటన మండల పరిధిలోని చిల్వర్ గ్రామంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన జగన్ (35), విఠల్ (25) ఇద్దరు అన్నదమ్ములు. వారు సెంట్రింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అన్నదమ్ములు మద్యం మత్తులో తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే భార్యా భర్తల మధ్య తగాదాలతో జగన్ భార్య గత కొన్ని రోజులుగా పుట్టింటికి వెళ్లిపోయింది. శుక్రవారం రాత్రి అన్నదమ్ముల మధ్య ఏం గొడవ జరిగింది.

ఆ పోట్లాటలో జగన్ ను తన తమ్ముడు విఠల్ బండ రాయితో మోది హత్య చేశాడు. శనివారం ఉదయం జగన్ మృతదేహాన్ని చూసిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని గ్రామస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం ద్వారా సేకరించిన ఆధారాలు సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News