దారుణం.. దొంగతనం నెపంతో ఓ అమాయకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం..!

నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రికి వచ్చిన ఓ అమాయకుడిపై దొంగతనం నెపంతో ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ కాలుతో తొక్కుతూ చిత్రహింసలకు గురి చేశారు.

Update: 2023-05-31 13:47 GMT

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రికి వచ్చిన ఓ అమాయకుడిపై దొంగతనం నెపంతో ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ కాలుతో తొక్కుతూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా అక్కడే ఉన్న మరి కొంత మంది రోగి బంధువులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతుండగా ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కేకలు వేస్తూ వదిలేయాలని మరోసారి ఇక్కడ రానంటూ ప్రాధేయపడుతూ కనిపించాడు. అయినా వినకుండా కాళ్ళపై కొడుతూ మోకాళ్ళను తొక్కుతూ చిత్రహింసలకు గురి చేయడం మానవత్వాన్ని మంటగలిసేలా కనబడుతుంది. నిజంగా దొంగతనమే చేసి ఉంటే పోలీసు అధికారులకు అప్పజెప్పి చట్టపరంగా శిక్షించవచ్చు కానీ అత్యుత్సాహంతో చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యక్తిని చిత్రహింసలకు గురి చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News