ఆన్‌లైన్ ప్రేమికుడి కోసం 5,000 కిమీ ప్రయాణించిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆన్‌లైన్‌ ప్రేమికుడి కోసం ఓ మహిళ 5000 కిలోమీటర్లు ప్రయాణించి బీచ్‌లో శవమై కనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పెరూకి చెందిన 51 ఏళ్ల మహిళ ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ వ్యక్తిని ప్రేమించింది.. Latest Telugu News

Update: 2022-11-25 08:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్‌ ప్రేమికుడి కోసం ఓ మహిళ 5000 కిలోమీటర్లు ప్రయాణించి బీచ్‌లో శవమై కనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పెరూకి చెందిన 51 ఏళ్ల మహిళ ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడిని కలవడానికి దాదాపు 5,000 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఆమె మృతదేహం బీచ్‌లో కనిపించింది. మహిళ మేనకోడలు సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె కోసం దర్యాప్తు చేస్తుండగా బీచ్‌లో శవమై కనిపించింది. ఈ ఘటనలో ఏం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News