1,385 కిలోల గంజాయి పట్టివేత

త్రిపుర రాష్ట్రంలోని అగర్తాలలో భారీగా గంజాయి పట్టుబడింది.

Update: 2023-03-27 16:58 GMT

దిశ, వెబ్ డెస్క్: త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాలో భారీగా గంజాయి పట్టుబడింది. బీఎస్ఎఫ్, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో రూ.2 కోట్లకు పైగా విలువైన 1,385 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరి కంటకనబడకుండా ఉండటానికి స్మగ్లర్లు గంజాయిని బస్తాల్లో నింపి భూమిలో పాతిపెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News