ప్రాణం తీసిన న్యూడ్ ఫొటోస్.. కర్నూల్‌లో దారుణ ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. యువతి న్యూడ్ ఫొటోలు ఓ యువకుడి హత్యకు దారితీశాయి.

Update: 2023-02-24 04:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. యువతి న్యూడ్ ఫొటోలు ఓ యువకుడి హత్యకు దారితీశాయి. వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లాకు చెందిన మురళి, దినేష్ ఇద్దరు మిత్రులు. అయితే, మురళి ఫ్రెండ్ షిప్‌కే మచ్చ తెచ్చేలా స్నేహితుడు దినేష్ ఫోన్ నుండి అతడి ప్రియురాలి నగ్న ఫొటోలను దొంగలించాడు. అనంతరం ఆ నగ్న ఫొటోలు అడ్డుపెట్టుకుని దినేష్ గర్ల్ ఫ్రెండ్‌ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. కాగా, ఈ విషయం యువతి ప్రియుడు దినేష్‌కు తెలిసిందే.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దినేష్ నమ్మకదోహ్రం చేసిన మిత్రుడు మురళిని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. కిరణ్ అనే మరో స్నేహితుడితో కలిసి దినేష్ మురళిని హత్య చేశాడు. అనంతరం మురళి మృతదేహాన్ని హంద్రీనీవా కాలువలో పడేశారు. కాగా, విషయం బయటకు పొక్కడంతో రంగంలోకి దిగిన పోలీసులు మురళి మృతదేహాం కోసం హంద్రీనీవా కాలువలో గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News