విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..

రామడుగు మండలంలోని వెదిర గ్రామానికి చెందిన వంచ శ్రీకాంత్ (27) విద్యుత్ షాక్ తో గురువారం మృతి చెందాడు.

Update: 2023-06-22 15:35 GMT

దిశ, రామడుగు : రామడుగు మండలంలోని వెదిర గ్రామానికి చెందిన వంచ శ్రీకాంత్ (27) విద్యుత్ షాక్ తో గురువారం మృతి చెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాంత్ తన ఇంటికి సిమెంటు పనులు చేస్తుండగా బాత్రూం పైన ఉన్న సిమెంటును ఊడ్చి వేసేందుకు పైకి ఎక్కడన్నారు. కాగా బాత్రూం పైన ఉన్న 33 కేవీ పవర్ లైన్ను గమనించక ఒకసారిగా పైకి లేచాడు. దీంతో విద్యుత్ తీగలు తలకు తగిలి అక్కడికక్కడే మరణించాడు. తండ్రి వంచ వీరారెడ్డి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకన్నట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News