విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..

విద్యత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం బీర్పూర్ మండలంలో జరిగింది.

Update: 2023-07-06 15:20 GMT

దిశ, బీర్ పూర్ : విద్యత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం బీర్పూర్ మండలంలో జరిగింది. పూర్తివివరాల్లోకెళితే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన కనక శ్రీనివాస్ (18) గురువారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.

మృతుడు తన మోటారు వైరు సరి చేసేందుకు విద్యుత్ సిబ్బంది అనుమతి లేకుండా కొల్వాయి గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ ను బందు చేసినట్టు సమచారం. ఆ తరువాత తిరిగి వచ్చి ట్రాన్స్ఫార్మర్ స్టార్ట్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News