బైక్‌పై వెళ్తున్న మహిళ టార్గెట్‌గా.. రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్

గుంటూరు జిల్లా మంగళగిరిలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు.

Update: 2023-05-21 08:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : గుంటూరు జిల్లా మంగళగిరిలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. బంగారు నగలు వేసుకుని ఒంటరిగా మహిళలు కనబడితే చాలు దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం వెంకటేశ్వరమ్మ అనే మహిళ బైక్‌పై వెళ్తోంది. అయితే చైన్ స్నాచర్స్ ఆమె పక్కనే వెళ్తూ గొలుసు లాక్కెళ్లిపోయాడు. దీంతో బైక్‌పై నుంచి వెంకటేశ్వరమ్మ కిందపడిపోయారు. దీంతో ఆమె గాయపడింది. అనంతరం పోలీసులకు వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు చేశారు. చైన్ స్నాచర్స్ లాక్కెళ్లిన గొలుసు విలువ రూ.1.28 లక్షల విలువ ఉంటుందని పోలీసులకు వెంకటేశ్వరమ్మ తెలిపింది. అనంతరం వైద్య చికిత్స నిమిత్తం ఆమె ఆస్పత్రికి వెళ్లారు.

Tags:    

Similar News