అప్పు ఎగ్గొట్టారని మనస్థాపంతో మహిళ సూసైడ్..!

అప్పుగా ఇచ్చిన డబ్బులను తిరిగివ్వట్లేదన్న కారణంతోA woman attempted suicide in Narsampet

Update: 2022-09-25 16:38 GMT

దిశ, నర్సంపేట: అప్పుగా ఇచ్చిన డబ్బులను తిరిగివ్వట్లేదన్న కారణంతో ఓ మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నర్సంపేట మండలంలోని నర్సింగాపురంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సామల మాధవి (38) వితంతురాలు. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి నర్సింగాపురం లోని తల్లి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో కందగట్ల ఆనంద్ అనే వ్యక్తికి ఏడాది కిందట రూ. లక్షా ఇరవై వేలు అప్పుగా ఇచ్చింది. కొన్ని నెలల అనంతరం ఇదే అప్పు విషయమై వీరిరువురు మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గత వారం కింద వీరి పంచాయతీ పోలీస్ స్టేషన్‌కి చేరింది.అయినప్పటికీ సరైన న్యాయం జరగలేదని సామల మాధవి మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో నర్సింగాపురం లోని ఆనంద్ ఇంటి ముందు మూడు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హుటాహుటిన వరంగల్‌లోని ఎం.జీ.ఎం ఆస్పత్రికి ఆమెను తరలించారు. చికిత్స పొందుతూ.. మాధవి ఆదివారం మృతి చెందింది. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కందగట్ల ఆనంద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు.

Similar News