ఇంట్లో ఉన్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగ

కేపీహెచ్బీలో మహిళ మెడలో నుంచి ఓ దొంగ బంగారు గొలుసు లాక్కెళ్లాడు.

Update: 2022-12-19 16:57 GMT

దిశ, కూకట్పల్లి: కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కేపీహెచ్బీ రోడ్డు నంబర్ 2 ఈడబ్ల్యూఎస్ 1039 లో నివాసం ఉంటున్న బీమిరెడ్డి వెంకట యజ్ఞ కుమారి(50) తమ వాకిట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె మెడలో నుంచి 2.5 తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ సిఐ కిషన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగ కదలికలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News